
పాల్వంచ, వెలుగు : మండలంలోని కేపీ జగన్నాథపురంలో ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సందడిగా మారింది. అమ్మవారికి నైవేద్యాలు, ఒడిబియ్యం, చీరలు, కనుమలు, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజ కార్యక్రమాల్లో పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ధర్మ కర్తలు చీకటి కార్తీక్, పెండ్లి రామిరెడ్డి, చెవుగాని పాపారావు పాల్గొన్నారు. కాగా మాస శివ రాత్రిని పురస్కరించుకొని సోమవారం రుద్ర హోమం నిర్వహించనున్నట్లు ఈవో రజనీ కుమారి తెలిపారు.